- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పొంగులేటి బచ్చా.. దోపిడీ దారులే ఆయన పంచన చేరారు : పువ్వాడ
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మంత్రి పువ్వాడ అజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ఖమ్మంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఓ బచ్చా అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్లో ఉండి.. సొంత పార్టీ నేతలను ఓడించేందుకు చూశారని ఫైర్ అయ్యారు. ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోలేదని ఆరోపించారు. అందుకే తాము పార్టీ నుంచి బహిష్కరించామని పేర్కొన్నారు. పొంగులేటి తనకు తాను ఎక్కువ ఊహించుకుంటున్నారని ఆరోపించారు.
డబ్బు ఉందన్న అహంకారంతో విర్రవీగిపోతున్నారని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో ఆయన ప్రభావం పెద్దగా ఉండదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయి ఇంతకాలం అయినా ఏ పార్టీలో చేరాలో కూడా పొంగులేటి తేల్చుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. పొంగులేటి సిద్ధాంతం విలువలు లేని వ్యక్తి అని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని దోపిడీ దారులు, అక్రమసంపాదన చేసిన వాళ్లే పొంగులేటి పంచన చేరారని ఆరోపించారు. ఇటీవల పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. నిన్న నిర్వహించిన సమావేశంలో కూడా ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. తాజాగా ఈ వ్యాఖ్యలకు పువ్వాడ కౌంటర్ ఇచ్చారు.
Read More: కాంగ్రెస్ అభ్యర్థులను నిర్ణయించేది కేసీఆరే.. బండి సెన్సేషనల్ కామెంట్స్